50 ఏళ్లలో తొలిసారి.. ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకుండా వామపక్షాలు!
- చివరి కంచుకోట కేరళలోనూ అధికారం కోల్పోతున్న వామపక్షాలు
- గత 50 ఏళ్లలో తొలిసారిగా ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని పరిస్థితి
- ఒకప్పుడు బెంగాల్, త్రిపుర, కేరళలో తిరుగులేని ఆధిపత్యం
- 2011లో పశ్చిమ బెంగాల్.. 2018లో త్రిపుర కోటలు బద్దలు
- ప్రధాని పదవిని సైతం శాసించిన స్థాయి నుంచి శూన్యంలోకి లెఫ్ట్ పార్టీలు
భారత రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన వామపక్షాలు, ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గత ఐదు దశాబ్దాల్లో ఇలాంటి రాజకీయ శూన్యం ఏర్పడటం ఇదే తొలిసారి కానుంది. తమ చివరి కంచుకోట అయిన కేరళలోనూ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) అధికారం కోల్పోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తుండటంతో కమ్యూనిస్టు పార్టీల భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది.
కేరళలో వెలువడుతున్న ఎన్నికల సరళి ప్రకారం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వెనుకంజలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఈ ఫలితాలు ఇలాగే కొనసాగితే, వామపక్షాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవుతుంది. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే సంబరాలు ప్రారంభించారు.
ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం.. ఇప్పుడు అధికారం శూన్యం
ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో వామపక్షాలది కీలక పాత్ర. 1996లో సీపీఎం అగ్రనేత జ్యోతి బసు యునైటెడ్ ఫ్రంట్ తరఫున ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా, పార్టీ పొలిట్బ్యూరో ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిని ఆయన తర్వాత 'చారిత్రక తప్పిదం'గా అభివర్ణించారు. 2008లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పార్లమెంటులో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర.. ఇలా మూడు రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి.
భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులది సుదీర్ఘ చరిత్ర
భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులది సుదీర్ఘ, ప్రభావవంతమైన చరిత్ర. 1957లో కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంగా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇక, పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2011 వరకు ఏకధాటిగా 34 ఏళ్లు పాలించి, దేశంలోనే సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా చరిత్రకెక్కారు. జ్యోతి బసు ఒక్కరే 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే, త్రిపురలోనూ 1993 నుంచి మాణిక్ సర్కార్ నేతృత్వంలో వరుస విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
గత దశాబ్ద కాలంగా క్రమంగా తగ్గిన వామపక్షాల ప్రాభవం
అయితే, గత దశాబ్ద కాలంగా వామపక్షాల ప్రాభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది. సింగూర్, నందిగ్రామ్ భూసేకరణ ఉద్యమాల నేపథ్యంలో 2011లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేతిలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత 2018లో బీజేపీ ప్రభంజనంలో త్రిపుర కోట కూడా బద్దలైంది. దీంతో కేరళ ఒక్కటే వామపక్షాలకు చివరి ఆశగా మిగిలింది. 2021లో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి పినరయి విజయన్ సంచలనం సృష్టించారు. అయితే, తాజా ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా ఉండటంతో వామపక్షాల పాలన శకం తాత్కాలికంగా ముగింపు దశకు చేరుకున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేరళలో వెలువడుతున్న ఎన్నికల సరళి ప్రకారం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వెనుకంజలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఈ ఫలితాలు ఇలాగే కొనసాగితే, వామపక్షాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవుతుంది. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే సంబరాలు ప్రారంభించారు.
ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం.. ఇప్పుడు అధికారం శూన్యం
ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో వామపక్షాలది కీలక పాత్ర. 1996లో సీపీఎం అగ్రనేత జ్యోతి బసు యునైటెడ్ ఫ్రంట్ తరఫున ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా, పార్టీ పొలిట్బ్యూరో ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిని ఆయన తర్వాత 'చారిత్రక తప్పిదం'గా అభివర్ణించారు. 2008లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పార్లమెంటులో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర.. ఇలా మూడు రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి.
భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులది సుదీర్ఘ చరిత్ర
భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులది సుదీర్ఘ, ప్రభావవంతమైన చరిత్ర. 1957లో కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంగా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇక, పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2011 వరకు ఏకధాటిగా 34 ఏళ్లు పాలించి, దేశంలోనే సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా చరిత్రకెక్కారు. జ్యోతి బసు ఒక్కరే 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే, త్రిపురలోనూ 1993 నుంచి మాణిక్ సర్కార్ నేతృత్వంలో వరుస విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
గత దశాబ్ద కాలంగా క్రమంగా తగ్గిన వామపక్షాల ప్రాభవం
అయితే, గత దశాబ్ద కాలంగా వామపక్షాల ప్రాభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది. సింగూర్, నందిగ్రామ్ భూసేకరణ ఉద్యమాల నేపథ్యంలో 2011లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేతిలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత 2018లో బీజేపీ ప్రభంజనంలో త్రిపుర కోట కూడా బద్దలైంది. దీంతో కేరళ ఒక్కటే వామపక్షాలకు చివరి ఆశగా మిగిలింది. 2021లో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి పినరయి విజయన్ సంచలనం సృష్టించారు. అయితే, తాజా ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా ఉండటంతో వామపక్షాల పాలన శకం తాత్కాలికంగా ముగింపు దశకు చేరుకున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.