కరీంనగర్లో పట్టపగలు కాల్పుల కలకలం.. జ్యువెల్లరీ షాప్లో భారీ దొంగతనం
- నగరంలోని పీఎంజీ జ్యువెల్లరీ దుకాణంలో దొంగతనం
- తుపాకులతో జ్యువెల్లరీ షాప్లోకి ప్రవేశించిన దుండగులు
- సిబ్బందిపై కాల్పులు జరిపి దొంగతనానికి పాల్పడిన దుండగులు
కరీంనగర్ పట్టణంలో ఓ జ్యువెల్లరీ దుకాణంలో భారీ దొంగతనం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటలకు దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు కాల్పులు జరిపి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని పీఎంజీ జ్యువెల్లరీ దుకాణంలోకి తుపాకులతో ఆరుగురు దుండగులు ప్రవేశించారు. జ్యువెల్లరీ దుకాణం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.
దీంతో ఆ దుండగులు సిబ్బందిపై 30 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. మిగతా సిబ్బందిని కట్టేసి వెళ్లిపోయారు. ఈ కాల్పుల్లో ముగ్గురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్కు తరలించారు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దీంతో ఆ దుండగులు సిబ్బందిపై 30 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. మిగతా సిబ్బందిని కట్టేసి వెళ్లిపోయారు. ఈ కాల్పుల్లో ముగ్గురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్కు తరలించారు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.