కేంద్రమంత్రులతో కలిసి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

Chandrababu offers prayers at Simhachalam Narasimha Swamy temple
  • సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
  • ఆలయ సంప్రదాయం ప్రకారం కప్ప స్తంభానికి మొక్కులు
  • సీఎం వెంట కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు
  • కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి, ప్రసిద్ధి చెందిన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించారు.

దర్శనం ముగిసిన తర్వాత, దేవస్థానం పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, గణబాబు తదితరులు కూడా స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. వీరి రాకతో సింహాచలం ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇవాళ విశాఖలో సీఎం చంద్రబాబు గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
Chandrababu
Simhachalam
TDP
Google
Vizag
Andhra Pradesh

More Telugu News