యుద్ధం ఆపి, జలసంధి తెరుస్తాం.. అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన
- అణు చర్చలను ప్రస్తుతానికి వాయిదా వేయాలని కోరిన ఇరాన్
- ప్రతిపాదనపై చర్చించేందుకు తన భద్రతా బృందంతో ట్రంప్ ఉన్నతస్థాయి సమావేశం
- ఇరాన్పై నావికా దిగ్బంధనం కొనసాగిస్తామని స్పష్టం చేసిన ట్రంప్
- చర్చల్లో పట్టు కోల్పోతామనే ఉద్దేశంతో ప్రతిపాదనకు అమెరికా విముఖత
అమెరికాతో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఇరాన్ ఒక కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. యుద్ధాన్ని ముగించి, కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని, అయితే అణు సంబంధిత చర్చలను మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేయాలని ఆ ప్రతిపాదనలో కోరినట్టు అమెరికా మీడియా సంస్థ 'యాక్సియోస్' తన కథనంలో పేర్కొంది. ఓ అమెరికా అధికారి, చర్చల గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ ఈ వివరాలను వెల్లడించింది.
చర్చల్లో నిలిచిపోయిన పరిస్థితిని అధిగమించడంతో పాటు, అణు రాయితీల పరిధిపై ఇరాన్ నాయకత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగే వ్యూహంలో భాగంగానే ఇరాన్ ఈ ప్రతిపాదన చేసిందని యాక్సియోస్ తెలిపింది. అయితే, ఈ ప్రతిపాదనకు అమెరికా అంగీకరిస్తే భవిష్యత్తు చర్చల్లో ఇరాన్పై ఒత్తిడి తెచ్చే అవకాశం అధ్యక్షుడు ట్రంప్ కోల్పోతారని నివేదిక విశ్లేషించింది. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించడం, యురేనియం శుద్ధిని శాశ్వతంగా నిలిపివేయించడమే ట్రంప్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు.
ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ తన జాతీయ భద్రతా, విదేశాంగ విధాన బృందంతో సోమవారం సిట్యుయేషన్ రూమ్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ముగ్గురు అధికారులు వెల్లడించారు. చర్చల్లో ప్రతిష్టంభన, తదుపరి చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్పై నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తామనే సంకేతాలు ఇచ్చారు. చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఇరాన్ను లొంగదీసుకోవచ్చని ఆయన భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఇటీవల ఇస్లామాబాద్లో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త ప్రతిపాదన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
చర్చల్లో నిలిచిపోయిన పరిస్థితిని అధిగమించడంతో పాటు, అణు రాయితీల పరిధిపై ఇరాన్ నాయకత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగే వ్యూహంలో భాగంగానే ఇరాన్ ఈ ప్రతిపాదన చేసిందని యాక్సియోస్ తెలిపింది. అయితే, ఈ ప్రతిపాదనకు అమెరికా అంగీకరిస్తే భవిష్యత్తు చర్చల్లో ఇరాన్పై ఒత్తిడి తెచ్చే అవకాశం అధ్యక్షుడు ట్రంప్ కోల్పోతారని నివేదిక విశ్లేషించింది. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించడం, యురేనియం శుద్ధిని శాశ్వతంగా నిలిపివేయించడమే ట్రంప్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు.
ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ తన జాతీయ భద్రతా, విదేశాంగ విధాన బృందంతో సోమవారం సిట్యుయేషన్ రూమ్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ముగ్గురు అధికారులు వెల్లడించారు. చర్చల్లో ప్రతిష్టంభన, తదుపరి చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్పై నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తామనే సంకేతాలు ఇచ్చారు. చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఇరాన్ను లొంగదీసుకోవచ్చని ఆయన భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఇటీవల ఇస్లామాబాద్లో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త ప్రతిపాదన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.