హైదరాబాద్ భక్తుడి ఉదారత.. తిరుమల శ్రీవారికి రూ.1.20 కోట్ల భారీ విరాళం

Hyderabad Devotee BVVSN Raju Donates Big to Tirumala Temple
  • తిరుమల శ్రీవారికి రూ.1.20 కోట్ల విరాళం
  • హైదరాబాద్‌కు చెందిన మాక్స్ ఇన్ ఫ్రా సంస్థ విరాళం
  • అదనపు ఈవోకు డీడీలు అందజేసిన దాత
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే విరాళాల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు శ్రీవారికి రూ.1.20 కోట్ల భారీ విరాళాన్ని సమర్పించారు. మాక్స్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన శ్రీ బి.వి.వి.ఎస్.ఎన్. రాజు తన భక్తిని చాటుకున్నారు.

శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.76 లక్షలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్నప్రసాద వితరణ కోసం రూ.44 లక్షలు కలిపి మొత్తం రూ.1.20 కోట్లను ఆయన విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌లను (డీడీలను) శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి దాత స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా దాత ఉదారతను అదనపు ఈవో అభినందించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఇటీవల కాలంలో శ్రీవారికి బంగారం, వెండితో పాటు భారీగా నగదు, వాహనాలు విరాళంగా ఇచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

మే నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
మరోవైపు, మే నెలలో తిరుమలలో పలు విశేష పర్వదినాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. మే 1న కూర్మ జయంతి, పౌర్ణమి గరుడసేవ, 2న అన్నమాచార్య జయంతి, 3న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం, 12న హనుమజ్జయంతి, 21న నమ్మాళ్వార్ ఉత్సవారంభం, 26న వరదరాజస్వామి వర్ష తిరు నక్షత్రం, 30న నమ్మాళ్వార్ శాత్తుమొర వంటి ఉత్సవాలను నిర్వహించనున్నారు.
Go Back to Shorts
BVVSN Raju
Tirumala
Tirumala Temple
TTD
Sri Venkateswara Anna Prasadam Trust
Max Infra Private Limited
Donation
Andhra Pradesh
Hindu Temple
Tirupati

More Telugu News