మహిళా రిజర్వేషన్ చట్టంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం: మల్లికార్జున ఖర్గే
మహిళా రిజర్వేషన్ చట్టం (నారీ శక్తి వందన్ అధినియమ్) అమలుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఈ చట్టంపై భాగస్వామ్య పక్షాలన్నింటితో చర్చలు జరపడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ఏప్రిల్ 15న తమ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు వ్యక్తపరిచే అభిప్రాయాలను, తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని ఖర్గే వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల అమలులో పారదర్శకత, వేగం ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు మహిళా రిజర్వేషన్ల విషయంలో తమ వైఖరిని స్పష్టం చేస్తున్న తరుణంలో, కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.