విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను తగ్గించుకోండి: కేంద్రం ఆదేశాలు
దేశీయ విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 25 శాతం మేర తగ్గించుకోవాలని దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విమానయాన సంస్థలకు మూడు నెలల పాటు ఈ తగ్గింపులు అందించాలని సూచించింది. ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో, దేశీయ విమాయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియా సంస్థలు భారీ నష్టాలు చవిచూశాయి.
దీనితో, విమానాశ్రయాలు వసూలు చేసే కొన్ని ఛార్జీలను తగ్గించేలా చూడమని ఆయా విమానయాన సంస్థలు కేంద్రాన్ని కేంద్రాన్ని కోరాయి. ఈ క్రమంలో కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఆదేశాలపై స్పందించింది. ఈ తాత్కాలిక ఛార్జీల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
దీనితో, విమానాశ్రయాలు వసూలు చేసే కొన్ని ఛార్జీలను తగ్గించేలా చూడమని ఆయా విమానయాన సంస్థలు కేంద్రాన్ని కేంద్రాన్ని కోరాయి. ఈ క్రమంలో కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఆదేశాలపై స్పందించింది. ఈ తాత్కాలిక ఛార్జీల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.