హర్మూజ్ వద్ద ఇరాన్ అనుమతి నిరాకరణ.. ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్జీ ఇబ్బందులు
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం ప్రారంభమై 39 రోజులవుతోంది. యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలను ఇరాన్ అనుమతించడం లేదు. ఆ దేశం అనుమతితో కొన్ని చమురు, గ్యాస్ కంటైనర్లు మాత్రం ఈ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్నాయి. హర్మూజ్ మీదుగా ఇరాన్ అనుమతి నిరాకరించడంతో గల్ఫ్ జలాల్లో సరుకు రవాణా నౌకలు పెద్ద మొత్తంలో ఉన్నట్లు షిప్ ట్రాకింగ్ డేటా వెల్లడిస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ క్షణం ఎటువైపు వెళుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. శాశ్వత శాంతి కోసం ఇరాన్ డిమాండ్ చేస్తుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు అందుకు భిన్నంగా ఉంది. దీంతో యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు. ఇది అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభానికి కారణమవుతోంది.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హర్మూజ్ మీదుగా ఇరాన్ ఒక్క ఎల్ఎన్జీ ట్యాంకర్కు కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇటీవల ఖతార్ నుంచి వచ్చిన రెండు ట్యాంకర్లను కూడా ఇరాన్ అనుమతించలేదు. దీంతో అవి వెనక్కి మళ్ళినట్లు తెలుస్తోంది. జలసంధి వద్ద ఇరాన్ అనుమతి నిరాకరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్జీకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ క్షణం ఎటువైపు వెళుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. శాశ్వత శాంతి కోసం ఇరాన్ డిమాండ్ చేస్తుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు అందుకు భిన్నంగా ఉంది. దీంతో యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు. ఇది అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభానికి కారణమవుతోంది.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హర్మూజ్ మీదుగా ఇరాన్ ఒక్క ఎల్ఎన్జీ ట్యాంకర్కు కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇటీవల ఖతార్ నుంచి వచ్చిన రెండు ట్యాంకర్లను కూడా ఇరాన్ అనుమతించలేదు. దీంతో అవి వెనక్కి మళ్ళినట్లు తెలుస్తోంది. జలసంధి వద్ద ఇరాన్ అనుమతి నిరాకరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్జీకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.