Donald Trump: అమెరికా సాయం చేయదు.. మీ ఆయిల్ మీరే తెచ్చుకోండి: మిత్రదేశాలపై ట్రంప్ ఫైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్పై సైనిక చర్యలో అమెరికాకు సహకరించని దేశాలు, తమకు కావాల్సిన చమురును తామే తెచ్చుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఒక పోస్ట్ పెట్టారు.
"ఇరాన్ను దెబ్బతీసే చర్యల్లో పాల్గొనడానికి నిరాకరించిన యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలకు నాదొక సూచన. మీకు రెండు మార్గాలున్నాయి. ఒకటి, మా దగ్గర పుష్కలంగా ఉన్న చమురును కొనుగోలు చేయండి. రెండు, కాస్త ధైర్యం తెచ్చుకుని హర్మూజ్ జలసంధికి వెళ్లి, మీకు కావాల్సిన చమురును మీరే తెచ్చుకోండి" అని ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు.
అంతేగాక మిత్రదేశాలు ఇకపై తమ కోసం తాము పోరాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. "అమెరికా మీకు సాయం చేయడానికి రాదు. మాకు అవసరమైనప్పుడు మీరు ఎలాగైతే దూరంగా ఉన్నారో, మేమూ అలాగే ఉంటాం. ఇరాన్ను మేము ఇప్పటికే దెబ్బతీశాం. కష్టమైన పని పూర్తయింది. ఇక వెళ్లి మీ చమురును మీరే తెచ్చుకోండి" అని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి నెల రోజులు దాటినా, ఇరాన్ ఇప్పటికీ హర్మూజ్ జలసంధిపై తన పట్టును కొనసాగిస్తోంది. ప్రపంచంలోని ఐదో వంతు చమురు రవాణా ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ఇరాన్ దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేయడంతో పాటు అనేక నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైంది.
"ఇరాన్ను దెబ్బతీసే చర్యల్లో పాల్గొనడానికి నిరాకరించిన యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలకు నాదొక సూచన. మీకు రెండు మార్గాలున్నాయి. ఒకటి, మా దగ్గర పుష్కలంగా ఉన్న చమురును కొనుగోలు చేయండి. రెండు, కాస్త ధైర్యం తెచ్చుకుని హర్మూజ్ జలసంధికి వెళ్లి, మీకు కావాల్సిన చమురును మీరే తెచ్చుకోండి" అని ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు.
అంతేగాక మిత్రదేశాలు ఇకపై తమ కోసం తాము పోరాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. "అమెరికా మీకు సాయం చేయడానికి రాదు. మాకు అవసరమైనప్పుడు మీరు ఎలాగైతే దూరంగా ఉన్నారో, మేమూ అలాగే ఉంటాం. ఇరాన్ను మేము ఇప్పటికే దెబ్బతీశాం. కష్టమైన పని పూర్తయింది. ఇక వెళ్లి మీ చమురును మీరే తెచ్చుకోండి" అని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి నెల రోజులు దాటినా, ఇరాన్ ఇప్పటికీ హర్మూజ్ జలసంధిపై తన పట్టును కొనసాగిస్తోంది. ప్రపంచంలోని ఐదో వంతు చమురు రవాణా ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ఇరాన్ దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేయడంతో పాటు అనేక నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైంది.