DK Shivakumar: ఐపీఎల్ టికెట్ల వివాదం ముగిసింది: డీకే శివకుమార్
కర్ణాటకలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఐపీఎల్ మ్యాచ్ల టికెట్ల కేటాయింపుపై నెలకొన్న వివాదం సుఖాంతమైంది. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించినట్లు ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్ సోమవారం ప్రకటించారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), డీఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
టికెట్ల సమస్యపై తాను ఇదివరకే స్పీకర్, ఇతర సీనియర్ నేతలతో చర్చించినట్లు డీకే శివకుమార్ తెలిపారు. తాజా ఒప్పందం ప్రకారం, ఐపీఎల్ మ్యాచ్లకు ఎమ్మెల్యేలు, ఎంపీలకు గతంలో నాలుగు టికెట్లు ఇచ్చే బదులు ఇప్పుడు మూడు టికెట్లు మాత్రమే అందిస్తారు. అంతర్జాతీయ మ్యాచ్ల విషయానికొస్తే, కేఎస్సీఏ రెండు కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తుంది. అదనంగా టికెట్లు కావాలంటే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ చర్చల్లో కేఎస్సీఏ అధ్యక్షుడు, భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా పాల్గొన్నాడు. టికెట్లు వద్దనుకునే వారు లేఖ ద్వారా తెలియజేయవచ్చని, ఈ సమస్య ఇప్పుడు ముగిసిపోయిందని డీకేశివకుమార్ అన్నారు.
రాజస్థాన్, ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులకు 50 నుంచి 60 శాతం వరకు టికెట్లు కేటాయిస్తారని, వాటితో పోలిస్తే కర్ణాటకలో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువని శివకుమార్ పేర్కొన్నారు.
చిన్నస్వామి స్టేడియం విస్తరణకు ప్రతిపాదనలు
చిన్నస్వామి స్టేడియం సీటింగ్ సామర్థ్యాన్ని పెంచే విషయంపై కూడా చర్చలు జరిపినట్లు డీకే శివకుమార్ వెల్లడించారు. స్టేడియం సామర్థ్యాన్ని మరో 20,000 పెంచగలిగితే ప్రయోజనకరంగా ఉంటుందని, దీనిపై ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన సమర్పించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ప్రతిపాదన అందిన తర్వాత ప్రభుత్వం దానిని పరిశీలిస్తుందని అన్నారు. రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు, తాను ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం భూమిని కేటాయించిందని, గోల్డెన్ స్పా సమీపంలో 25 ఎకరాలు, తుమకూరులో 25 ఎకరాలు, మైసూరులో కొంత భూమిని కేటాయించినట్లు తెలిపారు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా బహుళ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేలా కొత్త స్టేడియం నిర్మించడానికి బెంగళూరులో రెండు, మూడు ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు.
టికెట్ల సమస్యపై తాను ఇదివరకే స్పీకర్, ఇతర సీనియర్ నేతలతో చర్చించినట్లు డీకే శివకుమార్ తెలిపారు. తాజా ఒప్పందం ప్రకారం, ఐపీఎల్ మ్యాచ్లకు ఎమ్మెల్యేలు, ఎంపీలకు గతంలో నాలుగు టికెట్లు ఇచ్చే బదులు ఇప్పుడు మూడు టికెట్లు మాత్రమే అందిస్తారు. అంతర్జాతీయ మ్యాచ్ల విషయానికొస్తే, కేఎస్సీఏ రెండు కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తుంది. అదనంగా టికెట్లు కావాలంటే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ చర్చల్లో కేఎస్సీఏ అధ్యక్షుడు, భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా పాల్గొన్నాడు. టికెట్లు వద్దనుకునే వారు లేఖ ద్వారా తెలియజేయవచ్చని, ఈ సమస్య ఇప్పుడు ముగిసిపోయిందని డీకేశివకుమార్ అన్నారు.
రాజస్థాన్, ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులకు 50 నుంచి 60 శాతం వరకు టికెట్లు కేటాయిస్తారని, వాటితో పోలిస్తే కర్ణాటకలో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువని శివకుమార్ పేర్కొన్నారు.
చిన్నస్వామి స్టేడియం విస్తరణకు ప్రతిపాదనలు
చిన్నస్వామి స్టేడియం సీటింగ్ సామర్థ్యాన్ని పెంచే విషయంపై కూడా చర్చలు జరిపినట్లు డీకే శివకుమార్ వెల్లడించారు. స్టేడియం సామర్థ్యాన్ని మరో 20,000 పెంచగలిగితే ప్రయోజనకరంగా ఉంటుందని, దీనిపై ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన సమర్పించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ప్రతిపాదన అందిన తర్వాత ప్రభుత్వం దానిని పరిశీలిస్తుందని అన్నారు. రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు, తాను ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం భూమిని కేటాయించిందని, గోల్డెన్ స్పా సమీపంలో 25 ఎకరాలు, తుమకూరులో 25 ఎకరాలు, మైసూరులో కొంత భూమిని కేటాయించినట్లు తెలిపారు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా బహుళ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేలా కొత్త స్టేడియం నిర్మించడానికి బెంగళూరులో రెండు, మూడు ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు.