Margarita Robles: ఇరాన్పై దాడులలో పాల్గొంటున్న అమెరికా విమానాలకు గగనతలం మూసివేస్తున్నాం: స్పెయిన్
ఇరాన్పై దాడులలో పాల్గొంటున్న అమెరికా యుద్ధ విమానాల కోసం తమ దేశం గగనతలాన్ని మూసివేసినట్లు స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరీటా రోబెల్స్ ప్రకటించారు. ఇరుదేశాలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న సైనిక స్థావరాలను పశ్చిమాసియా ఘర్షణల కోసం వినియోగించడాన్ని ఇప్పటికే స్పెయిన్ నిరాకరించింది. తాజాగా, గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇరాన్తో యుద్ధానికి సంబంధించిన చర్యల కోసం సైనిక స్థావరాల వినియోగం లేదా గగనతల వినియోగానికి తాము అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఏకపక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ప్రారంభించిన యుద్ధంలో సహకరించకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకుందని అన్నారు. కాగా, అమెరికా, ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్పై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆయన చెబుతున్నారు.
ఇరాన్తో యుద్ధానికి సంబంధించిన చర్యల కోసం సైనిక స్థావరాల వినియోగం లేదా గగనతల వినియోగానికి తాము అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఏకపక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ప్రారంభించిన యుద్ధంలో సహకరించకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకుందని అన్నారు. కాగా, అమెరికా, ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్పై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆయన చెబుతున్నారు.