165 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. అమెరికా డాలర్ నోట్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం!
అమెరికా తన 165 ఏళ్ల నాటి సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో ముద్రించనున్న పేపర్ కరెన్సీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాన్ని చేర్చనున్నట్లు యూఎస్ ట్రెజరీ శాఖ గురువారం ప్రకటించింది. అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవ ప్రణాళికల్లో భాగంగా ఈ చారిత్రక మార్పుకు శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉన్న అధ్యక్షుడి సంతకాన్ని కరెన్సీపై చేర్చడం ఇదే మొదటిసారి.
ట్రెజరీ శాఖ వివరాల ప్రకారం ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్తో పాటు అధ్యక్షుడు ట్రంప్ సంతకం ఉన్న తొలి 100 డాలర్ల నోట్లు ఈ ఏడాది జూన్లో ముద్రణకు వెళ్లనున్నాయి. రాబోయే నెలల్లో ఇతర విలువల నోట్లను కూడా విడుదల చేస్తారు. విశేషమేమిటంటే, 1861 నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని పక్కనపెట్టి, ఫెడరల్ కరెన్సీ నుంచి యూఎస్ ట్రెజరర్ సంతకాన్ని తొలగించడం ఇదే తొలిసారి. దేశ ఆర్థిక పురోగతికి ఈ నిర్ణయం అద్దం పడుతుందని సెక్రటరీ బెస్సెంట్ తెలిపారు.
సాధారణంగా, జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని కరెన్సీపై ముద్రించడాన్ని అమెరికా చట్టాలు నిషేధిస్తాయి. అయితే, ఇది సంతకం మాత్రమే కావడంతో, యూఎస్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మరోవైపు, ఈ నిర్ణయంపై డెమోక్రాట్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమయంలో ఈ నిర్ణయం అనవసరమని వారు ఆరోపిస్తున్నారు. పెరిగిన ధరలకు ఎవరికి ధన్యవాదాలు చెప్పాలో ఈ సంతకం గుర్తు చేస్తుందని ప్రతినిధి శాంటెల్ బ్రౌన్ ఎద్దేవా చేశారు.
ట్రెజరీ శాఖ వివరాల ప్రకారం ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్తో పాటు అధ్యక్షుడు ట్రంప్ సంతకం ఉన్న తొలి 100 డాలర్ల నోట్లు ఈ ఏడాది జూన్లో ముద్రణకు వెళ్లనున్నాయి. రాబోయే నెలల్లో ఇతర విలువల నోట్లను కూడా విడుదల చేస్తారు. విశేషమేమిటంటే, 1861 నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని పక్కనపెట్టి, ఫెడరల్ కరెన్సీ నుంచి యూఎస్ ట్రెజరర్ సంతకాన్ని తొలగించడం ఇదే తొలిసారి. దేశ ఆర్థిక పురోగతికి ఈ నిర్ణయం అద్దం పడుతుందని సెక్రటరీ బెస్సెంట్ తెలిపారు.
సాధారణంగా, జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని కరెన్సీపై ముద్రించడాన్ని అమెరికా చట్టాలు నిషేధిస్తాయి. అయితే, ఇది సంతకం మాత్రమే కావడంతో, యూఎస్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మరోవైపు, ఈ నిర్ణయంపై డెమోక్రాట్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమయంలో ఈ నిర్ణయం అనవసరమని వారు ఆరోపిస్తున్నారు. పెరిగిన ధరలకు ఎవరికి ధన్యవాదాలు చెప్పాలో ఈ సంతకం గుర్తు చేస్తుందని ప్రతినిధి శాంటెల్ బ్రౌన్ ఎద్దేవా చేశారు.