Mamata Banerjee: మమతకు షాక్.. ఇద్దరు కీలక అధికారులపై ఈసీ వేటు

Shock to Mamata EC sacks two key officials
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), హోం సెక్రటరీలను ఆ పదవుల నుంచి తప్పించింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖ రాసింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తి, హోం సెక్రటరీ జగదీష్ ప్రసాద్ మీనాలను తక్షణమే బదిలీ చేయాలని ఆదేశించింది. వారి స్థానంలో కొత్త చీఫ్ సెక్రటరీగా 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దుష్యంత్ నరియాలాను, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి సంఘమిత్ర ఘోష్‌ను నియమించింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోగా కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించి, నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు బదిలీ అయిన అధికారులకు ఎలాంటి ఎన్నికల సంబంధిత బాధ్యతలు అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నాహకాలను సమీక్షించిన తర్వాత, నిష్పాక్షికమైన పోలింగ్ నిర్వహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే మమతా బెనర్జీ ప్రభుత్వంలోని కీలక అధికారులపై ఈసీ వేటు వేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Mamata Banerjee
West Bengal Elections
Election Commission of India
Voter List Irregularities
Gyanesh Kumar
Bengal Election News
Election Officials Removed
Political Controversy
BJP Allegations
Assembly Elections 2024

More Telugu News