పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సినీ నటి పూర్ణ

టాలీవుడ్ నటి, ‘ఢీ’ ఫేమ్ పూర్ణ (షామ్నా ఖాసిమ్) తన అభిమానులతో ఒక సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. ఆమె రెండోసారి తల్లి అయ్యారు. ఈ ఉదయం 4.25 గంటలకు ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించారు. తన జీవితంలోకి వచ్చిన ఈ చిన్నారి అపురూపమైన కానుక అని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ సాఫీగా జరిగినందుకు దేవుడికి, ఆసుపత్రి సిబ్బందికి పూర్ణ తన కృతజ్ఞతలు తెలిపారు.


పూర్ణకు 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీతో వివాహం జరిగింది. వీరికి 2023లో బాబు హమ్దాన్‌ జన్మించాడు. ఇప్పుడు మరోసారి తల్లి అయినట్టు పూర్ణ తీపి కబురు అందించారు. ఈ సందర్భంగా సినీ తారలు, అభిమానులు పూర్ణ దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.



More Telugu News