Iran: భారత్కు ఇరాన్ స్నేహహస్తం.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్కు ఇరాన్ కీలక మద్దతు ప్రకటించింది. ఇంధన సరఫరాలో ఆటంకాలు ఎదురవుతున్న తరుణంలో భారత నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా భారత్కు చెందిన ఒక ఎల్పీజీ ట్యాంకర్ శనివారం ఎలాంటి అడ్డంకులు లేకుండా హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. మరో ట్యాంకర్ కూడా త్వరలోనే భారత్ బయలుదేరనున్నట్లు సమాచారం.
భారత్తో ఉన్న సుదీర్ఘ మైత్రి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ తెలిపారు. "భారత్ మాకు మంచి మిత్రదేశం. భారతీయుల కష్టాన్ని మా కష్టంగా భావిస్తాం. ఇరు దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలు, భవిష్యత్తు ఉన్నాయి. అందుకే భారత నౌకలకు రక్షణ కల్పిస్తున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఈ యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇటీవల ఖతార్లోని గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేయడంతో అక్కడి నుంచి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఆందోళనతో సిలిండర్లను బుక్ చేసుకోవడంతో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్యాస్ పంపిణీకి కొత్త మార్గదర్శకాలు జారీ చేసి, దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 28 శాతం పెంచింది. అయితే, భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 70 శాతానికి పైగా ఇతర మార్గాల ద్వారానే వస్తున్నందున ఇంధన సరఫరాకు ఎలాంటి డోకా లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. "ప్రపంచంలోనే భారత్ నాలుగో అతిపెద్ద రిఫైనర్. ఇంధన లభ్యతపై ఆందోళన అవసరం లేదు" అని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు.
భారత్తో ఉన్న సుదీర్ఘ మైత్రి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ తెలిపారు. "భారత్ మాకు మంచి మిత్రదేశం. భారతీయుల కష్టాన్ని మా కష్టంగా భావిస్తాం. ఇరు దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలు, భవిష్యత్తు ఉన్నాయి. అందుకే భారత నౌకలకు రక్షణ కల్పిస్తున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఈ యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇటీవల ఖతార్లోని గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేయడంతో అక్కడి నుంచి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఆందోళనతో సిలిండర్లను బుక్ చేసుకోవడంతో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్యాస్ పంపిణీకి కొత్త మార్గదర్శకాలు జారీ చేసి, దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 28 శాతం పెంచింది. అయితే, భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 70 శాతానికి పైగా ఇతర మార్గాల ద్వారానే వస్తున్నందున ఇంధన సరఫరాకు ఎలాంటి డోకా లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. "ప్రపంచంలోనే భారత్ నాలుగో అతిపెద్ద రిఫైనర్. ఇంధన లభ్యతపై ఆందోళన అవసరం లేదు" అని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు.