Nidhi Chibber: నీతి ఆయోగ్ సీఈఓగా నిధి ఛిబ్బర్కు అదనపు బాధ్యతలు
- ప్రస్తుత సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పదవీకాలం పూర్తికావడంతో నియామకం
- ప్రస్తుతం నీతి ఆయోగ్ డీఎంఈఓ డైరెక్టర్ జనరల్గా ఛిబ్బర్
- నిధి ఛత్తీస్గఢ్ కేడర్కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి
కేంద్ర ప్రభుత్వ విధాన రూపకల్పనలో కీలకమైన నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నిధి ఛిబ్బర్కు కేంద్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం మూడేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగియడంతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రస్తుతం నీతి ఆయోగ్ పరిధిలోని డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ (డీఎంఈఓ) డైరెక్టర్ జనరల్గా నిధి ఛిబ్బర్ పనిచేస్తున్నారు. ఈ హోదాలో కొనసాగుతూనే ఆమె సీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఛత్తీస్గఢ్ కేడర్కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె, గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చైర్పర్సన్గా పనిచేసి కీలక సంస్కరణలు చేపట్టారు.
పదవీ విరమణ చేసిన బీవీఆర్ సుబ్రహ్మణ్యం, 'వికసిత్ భారత్ @2047' లక్ష్య సాధన కోసం రాష్ట్రస్థాయి పాలన, డిజిటల్ పరివర్తనపై దృష్టి సారించారు. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన గతంలో ప్రధానమంత్రి కార్యాలయం, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ప్రపంచ బ్యాంకులో పనిచేశారు. అలాగే, జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలందించారు.
ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ కీలక పాలసీ థింక్ ట్యాంక్ సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వాములను చేస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తుంది.
ప్రస్తుతం నీతి ఆయోగ్ పరిధిలోని డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ (డీఎంఈఓ) డైరెక్టర్ జనరల్గా నిధి ఛిబ్బర్ పనిచేస్తున్నారు. ఈ హోదాలో కొనసాగుతూనే ఆమె సీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఛత్తీస్గఢ్ కేడర్కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె, గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చైర్పర్సన్గా పనిచేసి కీలక సంస్కరణలు చేపట్టారు.
పదవీ విరమణ చేసిన బీవీఆర్ సుబ్రహ్మణ్యం, 'వికసిత్ భారత్ @2047' లక్ష్య సాధన కోసం రాష్ట్రస్థాయి పాలన, డిజిటల్ పరివర్తనపై దృష్టి సారించారు. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన గతంలో ప్రధానమంత్రి కార్యాలయం, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ప్రపంచ బ్యాంకులో పనిచేశారు. అలాగే, జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలందించారు.
ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ కీలక పాలసీ థింక్ ట్యాంక్ సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వాములను చేస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తుంది.