Piyush Dhamanotiya: అత్యంత పైశాచికం... ప్రియురాలిపై అత్యాచారం, హత్య.. ఆపై మృతదేహంపై లైంగిక చర్యలు!

మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో అత్యంత భయానక, అమానుష ఘటన వెలుగుచూసింది. తనతో పాటు ఎంబీఏ చదువుతున్న ప్రియురాలిని ఓ యువకుడు అతి కిరాతకంగా రేప్ చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహంపై లైంగిక చర్యలకు (నెక్రోఫిలియా) పాల్పడి, ఆపై ముంబై పారిపోయి ఆమె ఆత్మతో మాట్లాడేందుకు తాంత్రిక పూజలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో నిందితుడైన పీయూష్ ధమనోటియా (24)ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 10న 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని, కాలేజీ స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఫోన్ నుంచి తండ్రికి "పాప ఇంటికి రాదు" అని సందేశం వచ్చింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అదే సమయంలో, ఆమె కాలేజీ వాట్సాప్ గ్రూప్‌లో 11 అసభ్యకర వీడియోలు పోస్ట్ అయ్యాయి. ఈ వీడియోల గురించి కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మూడు రోజుల తర్వాత, నిందితుడు పీయూష్ అద్దెకు ఉంటున్న గది నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా, యువతి మృతదేహం నగ్నంగా, కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె కాళ్లకు ఉన్న సాక్స్‌ల ఆధారంగా తండ్రి తన కూతురి మృతదేహాన్ని గుర్తించారు.

విచారణలో పీయూష్ చెప్పిన విషయాలు పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేశాయి. శారీరక సంబంధానికి నిరాకరించడంతో, ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశానని ఒప్పుకున్నాడు. ప్రతిఘటించడంతో చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డ కుక్కి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక కత్తితో పొడిచాడు. ఆ తర్వాత గదిలోనే మృతదేహం పక్కన కూర్చుని బీరు తాగాడు. అంతటితో ఆగకుండా మృతదేహంపై లైంగిక చర్యలకు పాల్పడ్డానని అంగీకరించాడు.

హత్య తర్వాత ఆమె ఫోన్‌ను ధ్వంసం చేసి, ముంబైకి పారిపోయాడు. అక్కడ పాన్‌వెల్ ప్రాంతంలో యూట్యూబ్‌లో వీడియోలు చూసి, ఆమె ఆత్మను పిలిచి క్షమాపణ చెప్పేందుకు తాంత్రిక పూజలు చేశాడు. ముంబై పోలీసుల సహకారంతో పీయూష్‌ను అరెస్ట్ చేసి ఇందోర్‌కు తరలించారు. విచారణలో అతను "ఏం జరగాల్సి ఉందో అది జరిగిపోయింది" అంటూ నిర్లక్ష్యంగా, నవ్వుతూ సమాధానాలు చెప్పడం అతని మానసిక స్థితికి అద్దం పడుతోంది. తన ప్రియురాలు డేటింగ్ యాప్‌లో ఇతరులతో మాట్లాడుతోందన్న అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Piyush Dhamanotiya
Indore murder
MBA student murder
necrophilia
crime news
Madhya Pradesh crime
girlfriend murder
sexual assault
tantrik pooja
dating app

More Telugu News