బీజేపీ మద్దతుతో ఆలియాబాద్ మున్సిపాలిటీని దక్కించుకున్న కాంగ్రెస్

  • బీజేపీ, ఇతరులు మద్దతివ్వడంతో ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన శిరీష
  • ఆలియాబాద్‌లో 20కి గాను ఎనిమిది స్థానాలు గెలిచిన కాంగ్రెస్
  • ఏ పార్టీకి రాని సంపూర్ణ మెజారిటీ
తెలంగాణ వ్యాప్తంగా కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. హంగ్ వచ్చిన చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీని బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఆలియాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌కు చెందిన కంఠం శిరీష ఎన్నికయ్యారు. బీజేపీ, ఇతరుల మద్దతుతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ సొంతమైంది.

ఆలియాబాద్ మున్సిపాలిటీలోని 20 స్థానాలకు గాను కాంగ్రెస్ ఎనిమిది, బీఆర్ఎస్ ఏడు, బీజేపీ మూడు, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ ఈ మున్సిపాలిటీని దక్కించుకుంది.

నల్గొండ నగరపాలక సంస్థ తొలి మేయర్‌గా బుర్రి చైతన్య

నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్‌గా బుర్రి చైతన్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రకటించారు. నల్గొండలో 48కి గాను కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఇతరులు 8 స్థానాలను గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో బుర్రి చైతన్య మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. నల్గొండ డిప్యూటీ మేయర్‌గా మహమ్మద్ ఆశ్రఫ్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు.


More Telugu News