థాంక్యూ థరూర్... దుమారం సద్దుమణిగితే అసలు వాస్తవాలు కనిపిస్తాయి: గంభీర్
- న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఓటమి తర్వాత గంభీర్పై విమర్శలు
- విమర్శల వేళ గంభీర్కు మద్దతుగా నిలిచిన శశి థరూర్
- ప్రధాని తర్వాత అత్యంత కష్టమైన ఉద్యోగం గంభీర్దేనని వ్యాఖ్య
- థరూర్ మద్దతుకు ధన్యవాదాలు తెలిపిన గౌతమ్ గంభీర్
- కోచ్ అధికారాలపై నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయన్న గంభీర్
న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ను టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి తర్వాత హెడ్ కోచ్గా గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై, అతడి వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గంభీర్కు థరూర్ మద్దతు పలకడం తెలిసిందే.
"నాగ్పూర్లో నా పాత మిత్రుడు గౌతమ్ గంభీర్తో మాట్లాడాను. ప్రధానమంత్రి తర్వాత భారతదేశంలో అత్యంత కష్టమైన ఉద్యోగం ఆయనదే. రోజూ లక్షలాది మంది ఆయనను విమర్శిస్తున్నా, ప్రశాంతంగా, ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయన నిశ్శబ్ద సంకల్పానికి, సమర్థ నాయకత్వానికి అభినందనలు" అని థరూర్ ప్రశంసించారు. ఈ ట్వీట్ పైనే తాజాగా గంభీర్ స్పందించాడు.