భోగాపురం ఎయిర్ పోర్టుకు 2014-19లోనే పనులు ప్రారంభించాం: సీఎం చంద్రబాబు

  • భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లో వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతం
  • వచ్చే జూన్ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం
  • ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇది కీలక మైలురాయి అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • 2014-19 ఎన్డీఏ హయాంలోనే విమానాశ్రయానికి ప్రణాళికలు వేశామన్న సీఎం
  • రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2014-19 మధ్య ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే ప్రణాళికలు రచించి, పనులు ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర విమానయాన రంగంలో ఒక కొత్త మైలురాయి అని అభివర్ణించారు.

ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తుందని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో వచ్చే జూన్ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారానికి, ఆయన దార్శనికతకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. భోగాపురం విమానాశ్రయంలో విమాన రాకపోకలకు సంబంధించి నిర్వహించిన వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతం కావడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగవంతం అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.



More Telugu News