Chandrasekhar Reddy: పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అనుచరుడు

Jagans Close Aide Chandrasekhar Reddy Switches to TDP in Pulivendula
షార్ట్స్‌లో చూడండి
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి వలసల బెడద కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అనుచరుడు, వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి (దిల్ మాంగే) తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. వందలాది మంది వైసీపీ కార్యకర్తలతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముందు వేంపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురు స్థానిక టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరుగుతున్నప్పటికీ, జగన్ రాజకీయ కంచుకోట అయిన పులివెందులలోనే కీలక నేతలు పార్టీ వీడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామం స్థానికంగా వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.
Go Back to Shorts
Chandrasekhar Reddy
Pulivendula
YSRCP
TDP
Andhra Pradesh Politics
Jagan Mohan Reddy
B.Tech Ravi
Vempalli
Telugu Desam Party
Political Defection

More Telugu News