బీహార్ ఫలితాలు నిజంగా ఆశ్చర్యపరిచాయి.. అందుకే మేం ఓడిపోయాం: రాహుల్ గాంధీ
- బీహార్ ఎన్నికలు మొదటి నుంచి న్యాయంగా జరగలేదన్న రాహుల్ గాంధీ
- రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడుతున్నామన్న కాంగ్రెస్ నేత
- బీహార్లో 61 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. బీహార్లో ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బీహార్ ఎన్నికలు మొదటి నుంచి న్యాయంగా జరగలేదని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే తమ పార్టీ ఓటమి పాలైందని తెలిపారు.
రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు తాము పోరాడుతున్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఫలితాలను సమీక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జరుగుతున్న పోరాటమని ఆయన వ్యాఖ్యానించారు. మహాఘట్బంధన్పై విశ్వాసం ఉంచి ఓటు వేసిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి 200కు పైగా స్థానాలు గెలుచుకోగా, ఆర్జేడీ-కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ 34 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీహార్లో కాంగ్రెస్ పార్టీకి ఇది రెండో అత్యంత దారుణ ఓటమి. 2010లో కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.
రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు తాము పోరాడుతున్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఫలితాలను సమీక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జరుగుతున్న పోరాటమని ఆయన వ్యాఖ్యానించారు. మహాఘట్బంధన్పై విశ్వాసం ఉంచి ఓటు వేసిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి 200కు పైగా స్థానాలు గెలుచుకోగా, ఆర్జేడీ-కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ 34 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీహార్లో కాంగ్రెస్ పార్టీకి ఇది రెండో అత్యంత దారుణ ఓటమి. 2010లో కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.