Nagarjuna Yadav: ఆహారం త్వరగా ఇవ్వలేదని.. హోటల్‌పై వైసీపీ నేత దౌర్జన్యం

YSRCP Leader Nagarjuna Yadav Allegedly Attacks Hotel Over Food Delay
షార్ట్స్‌లో చూడండి
పల్నాడు జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత వివాదంలో చిక్కుకున్నారు. కేవలం ఆహారం అందించడం ఆలస్యమైందన్న చిన్న కారణంతో ఓ హోటల్‌ సిబ్బందిపై ఆయన, ఆయన అనుచరులు దాడికి పాల్పడిన ఘటన సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సత్తెనపల్లిలోని గుడ్‌మార్నింగ్ హోటల్‌కు వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తన అనుచరులతో కలిసి వెళ్లారు. అక్కడ తాము ఆర్డర్ చేసిన ఆహారం తీసుకురావడం ఆలస్యం కావడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో హోటల్ యజమాని శేఖర్‌తో పాటు ఇతర సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

మాటామాటా పెరగడంతో నాగార్జున యాదవ్, ఆయన అనుచరులు సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో ఇద్దరు హోటల్ సిబ్బందికి గాయాలయ్యాయి. అంతేకాకుండా, "మాకు ఎదురుతిరిగితే మావాళ్లు అంతా వస్తారు" అంటూ నాగార్జున యాదవ్ తమను బెదిరించినట్లు హోటల్ సిబ్బంది తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం బాధితులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, నాగార్జున యాదవ్‌పై ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి వివరాలు స్వీకరించిన పోలీసులు, వైసీపీ నేతపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
Go Back to Shorts
Nagarjuna Yadav
YSRCP
Sattenapalli
Palnadu district
Hotel attack
Food delay
Assault
Andhra Pradesh politics
Hotel staff
Police complaint

More Telugu News