Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి దర్శనాలు నేటి అర్ధరాత్రి వరకే!

లక్షలాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. శనివారం మధ్యాహ్నం 1:30 గంటలలోపే నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేలా స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రకటించారు. బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది.

భక్తుల దర్శనం కోసం నేటి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత రేపు తెల్లవారుజాము నుంచే విగ్రహం వద్ద ఉన్న షెడ్డును తొలగించే పనులు మొదలుపెడతారు. అదే రోజు రాత్రి 12 గంటల తర్వాత విగ్రహాన్ని భారీ ట్రాలీపైకి చేర్చి, వెల్డింగ్ పనులు చేపడతారు. ఈ పనులన్నీ పూర్తి కాగానే శోభాయాత్రకు విగ్రహాన్ని సిద్ధం చేస్తారు.

ఈ ఏర్పాట్లపై సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ శనివారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం 1:30 గంటల లోపు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ ప్రణాళిక ప్రకారం, యాత్ర సజావుగా, నిర్ణీత సమయంలో ముగిసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Khairatabad Ganesh
Khairatabad Ganesh idol
Ganesh Nimajjanam 2024
Hyderabad Ganesh festival
Ganesh procession
Hussain Sagar lake
Telangana festivals
Hyderabad events
Ganesh Visarjan
Khairatabad Ganesh Shobha Yatra

More Telugu News