ఖైరతాబాద్‌లో సిద్దమైన మహా గణపతి

  • 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహం రెడీ 
  • నేత్రావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రముఖ శిల్పి రాజేందర్
  • భక్తుల సందడి మధ్య 'బడా గణేశ్ ఆగమన్' కార్యక్రమం 
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వినాయక మండపాల్లో ఖైరతాబాద్ (హైదరాబాద్) గణేశ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ ఏటా భారీ విగ్రహం, విశేష అలంకరణలతో జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ సంవత్సరం కూడా 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేశ్‌ సిద్ధమయ్యారు.

గణేశ్ విగ్రహ నిర్మాణంలో చివరి దశ అయిన నేత్రావిష్కరణ కార్యక్రమాన్ని నిన్న ఘనంగా నిర్వహించారు. ప్రముఖ శిల్పి రాజేందర్ గణపతికి నేత్రాలు గీశారు. మూర్తికి "ప్రాణ ప్రతిష్ఠ"కు ముందు జరిగే ఈ నేత్రావిష్కరణను విశేషంగా పరిగణిస్తారు.

బడా గణేశ్ ఆగమన్ – భక్తుల సందడి

నేత్రావిష్కరణ అనంతరం ‘బడా గణేశ్ ఆగమన్’ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. డీజే బీట్స్, మరాఠీ బ్యాండ్, సంప్రదాయ తాళాలు, డోలు వాయిద్యాలతో గణపతికి స్వాగతం పలికారు. నగర యువత జోలిపాలు తొడగట్టుకొని నృత్యాలతో పాల్గొంటూ ఉత్సాహాన్ని పంచారు. వీధులన్నీ భక్తుల కోలాహలంతో మారుమోగాయి. 


More Telugu News