ఒకే ఈవెంట్‌లో మెరిసిన విజ‌య్‌-ర‌ష్మిక‌.. ఇదిగో వీడియో

  • న్యూయార్క్‌లో ఘ‌నంగా వార్షిక 'ఇండియా డే పరేడ్'
  • భారత 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సంద‌ర్భంగా భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో ఈవెంట్‌
  • ప్ర‌త్యేక అతిథులుగా హాజరైన విజ‌య్‌, ర‌ష్మిక‌
  • నెట్టింట ఈ జంట ఫొటోలు, వీడియోల వైర‌ల్  
అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించిన వార్షిక 'ఇండియా డే పరేడ్' ఘ‌నంగా జరిగింది. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ ఉత్సవాలుగా జరుపుకునే క్ర‌మంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రతి ఏటా ఈ పరేడ్‌ను నిర్వహిస్తోంది. భారత 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికాలో అతిపెద్ద భారతీయ పరేడ్ అయిన 'ఇండియా డే పరేడ్'ను ఈసారి కూడా అంతే ఘనంగా నిర్వహించారు. 

ఈ వేడుకకు వేలాదిమంది భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. ప్రముఖ సినీతారలు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి ప్ర‌త్యేక అతిథులుగా హాజరై పరేడ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొన్ని రోజులుగా ఈ జంట రిలేష‌న్‌లో ఉందంటూ పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విజ‌య్‌-ర‌ష్మిక తాలూకు న్యూయార్క్ ప‌రేడ్ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు మ‌రోసారి నెట్టింట‌ వైర‌ల్ అవుతున్నాయి.

ఇక‌, ఈ జంట 'గీత గోవిందం',  'డియ‌ర్ కామ్రేడ్' వంటి చిత్రాల్లో క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, త్వ‌ర‌లోనే ర‌ష్మిక‌, విజ‌య్ హీరోహీరోయిన్లుగా మ‌రో మూవీ తెర‌కెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాహుల్ సంకృత్యాయన్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి ఈ జంట అభిమానుల‌కు క‌నువిందు చేయ‌నుందని స‌మాచారం. పీరియాడిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రానున్న ఈ ప్రాజెక్ట్‌ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నుంది. 


More Telugu News