Balrampur Rape Case: యూపీ ఎస్పీ బంగ్లా సమీపంలోనే దివ్యాంగురాలి కిడ్నాప్.. సామూహిక అత్యాచారం!
- ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో దారుణ ఘటన
- బైక్లపై వెంబడించి అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు
- ఎస్పీ, కలెక్టర్ నివాసాలకు సమీపంలోనే దారుణం
- ఇది సామూహిక అత్యాచారమని కుటుంబ సభ్యుల ఆరోపణ
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
ఉత్తరప్రదేశ్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ, కలెక్టర్, న్యాయమూర్తులు వంటి ఉన్నతాధికారుల నివాసాలకు కేవలం కిలోమీటరు దూరంలోనే ఓ దివ్యాంగ యువతి కిడ్నాప్కు, అత్యాచారానికి గురవడం కలకలం రేపుతోంది. ఈ దారుణానికి ముందు, కొందరు వ్యక్తులు బైక్లపై వెంబడిస్తుండగా ఆమె ప్రాణభయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు ఎస్పీ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
బలరాంపూర్కు చెందిన 21 ఏళ్ల దివ్యాంగ యువతి సోమవారం తన మేనమామ ఇంటి నుంచి తన ఇంటికి నడుచుకుంటూ తిరిగి వస్తోంది. మార్గమధ్యంలో బైక్పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెను బలవంతంగా ఎక్కించుకుని, సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని అదనపు ఎస్పీ విశాల్ పాండే తెలిపారు. అయితే, బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపిస్తున్నారు.
సమయానికి యువతి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించగా, ఓ పోలీస్ పోస్ట్ సమీపంలోని పొదల్లో అపస్మారక స్థితిలో, చిరిగిన దుస్తులతో ఆమె కనిపించింది. స్పృహలోకి వచ్చాక ఆమె చెబుతూ, బైక్లపై వచ్చిన కొందరు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు వెల్లడించింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని ఏఎస్పీ విశాల్ పాండే ధ్రువీకరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన వివరించారు.
ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, పోలీసుల నిర్లక్ష్యంపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. యువతిని గుర్తించిన పోలీస్ పోస్ట్ సమీపంలోని సీసీటీవీ కెమెరాలు పని చేయడం లేదని వారు ఆరోపించారు. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలోనే ఇలాంటి దారుణం జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
బలరాంపూర్కు చెందిన 21 ఏళ్ల దివ్యాంగ యువతి సోమవారం తన మేనమామ ఇంటి నుంచి తన ఇంటికి నడుచుకుంటూ తిరిగి వస్తోంది. మార్గమధ్యంలో బైక్పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెను బలవంతంగా ఎక్కించుకుని, సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని అదనపు ఎస్పీ విశాల్ పాండే తెలిపారు. అయితే, బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపిస్తున్నారు.
సమయానికి యువతి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించగా, ఓ పోలీస్ పోస్ట్ సమీపంలోని పొదల్లో అపస్మారక స్థితిలో, చిరిగిన దుస్తులతో ఆమె కనిపించింది. స్పృహలోకి వచ్చాక ఆమె చెబుతూ, బైక్లపై వచ్చిన కొందరు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు వెల్లడించింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని ఏఎస్పీ విశాల్ పాండే ధ్రువీకరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన వివరించారు.
ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, పోలీసుల నిర్లక్ష్యంపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. యువతిని గుర్తించిన పోలీస్ పోస్ట్ సమీపంలోని సీసీటీవీ కెమెరాలు పని చేయడం లేదని వారు ఆరోపించారు. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలోనే ఇలాంటి దారుణం జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.