Bangladesh Plane Crash: బంగ్లాదేశ్ విమాన ప్రమాదంలో 19కి పెరిగిన మృతుల సంఖ్య... కూలిపోయింది చైనా తయారీ విమానం!

Bangladesh Plane Crash 19 Killed in Dhaka
షార్ట్స్‌లో చూడండి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో సోమవారం ఓ యుద్ధ విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 19కి పెరిగింది. మృతుల్లో 16 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ఒక పైలెట్ ఉన్నారు. ఈ మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో, గాయపడిన వారి సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కూలిపోయిన విమానం ఎఫ్-7బీజీఐ రకానికి చెందినది. ఇది చైనా జె-7 యుద్ధ విమానానికి అధునాతన వెర్షన్. బంగ్లాదేశ్ వాయుసేన వద్ద ఉన్న 16 విమానాల్లో ఇది ఒకటి. స్థానిక నివేదికల ప్రకారం, ఎఫ్-7బీజీఐ విమానం సాధారణ శిక్షణ విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

టీవీ ఫుటేజ్, ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన వీడియోలలో ప్రమాద స్థలం వద్ద మంటలు, పొగ దట్టంగా వెలువడుతూ కనిపించాయి. అత్యవసర సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఓ వీడియోలో శిథిలాల కింద కూరుకుపోయిన విమాన ఇంజిన్ దృశ్యం భీతావహంగా ఉంది. దూరం నుంచి తీసిన మరో వీడియోలో మండుతున్న శిథిలాల వద్దకు ప్రజలు గుమిగూడటం, ఒక అంతస్తు పాఠశాల భవనం మంటల్లో కాలిపోవడం కనిపించింది మరో వీడియోలో, గాయపడిన ఓ వ్యక్తి మసి, శిథిలాల మధ్య నుంచి చిరిగిన దుస్తులతో అక్కడి నుండి దూరంగా వెళుతూ కనిపించాడు.

Go Back to Shorts
Bangladesh Plane Crash
Dhaka Plane Crash
Bangladesh Air Force
F-7BGI
China J-7
Milestone School and College
Plane Crash Victims
Bangladesh News
War Plane Crash

More Telugu News