Revanth Reddy: అమెరికా స్వాతంత్ర్య వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy Attends America Independence Day Celebrations
  • తాజ్ కృష్ణ హోటల్‌లో అమెరికా స్వాతంత్ర్య వేడుకలు
  • కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్‌తో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి
  • భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్రమంగా పెరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి
హైదరాబాద్‌లో జరిగిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాజ్ కృష్ణ హోటల్‌లో 249వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశం, అమెరికా మధ్య దౌత్య సంబంధాలు 1947లో ప్రారంభమై నేటి వరకు రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, విద్య, సాంకేతిక రంగాల్లో మరింత దృఢంగా మారాయని అన్నారు. ఈ వేడుకలో భారత్-అమెరికా స్నేహ సంబంధాలను గుర్తు చేస్తూ, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
Revanth Reddy
Telangana
America Independence Day
US Consulate Hyderabad

More Telugu News