Shilpa Chakravarthi: టీవీ నటి శిల్పా చక్రవర్తి భూ వివాదం.. ఎస్సైకి హైకోర్టు నోటీసులు

Shilpa Chakravarthi Land Dispute High Court Notices to SI
షార్ట్స్‌లో చూడండి
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ టీవీ నటి శిల్పా చక్రవర్తికి సంబంధించిన భూవివాదంలో తలదూర్చడంపై పోలీసుల తీరును తప్పుబట్టింది. సివిల్ కోర్టులో కేసు నడుస్తుండగా, ఇంజంక్షన్ ఉత్తర్వులు అమల్లో ఉండగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తూ నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్సై రామ్మూర్తికి వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది.

నల్గొండ జిల్లా కుర్మేడ్ గ్రామంలోని 32 ఎకరాల భూమికి సంబంధించి పోలీసులు తమను వేధిస్తున్నారంటూ నటి శిల్పా చక్రవర్తి, ఆమె భర్త జడ కల్యాణ్ యాకయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి. వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, 2017లో మహమ్మద్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి నుంచి పిటిషనర్లు ఈ భూమిని కొనుగోలు చేశారని తెలిపారు.

ఈ భూమిపై సివిల్ కోర్టు నుంచి ఇంజంక్షన్ ఉత్తర్వులతో పాటు పోలీసు రక్షణ కూడా పొందారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ, స్థానిక ఎస్సై అమ్మిన వ్యక్తితో కుమ్మక్కై, వివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ పిటిషనర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అనంతరం, తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేశారు.
Go Back to Shorts
Shilpa Chakravarthi
Shilpa Chakravarthi land dispute
Telangana High Court
Chintapalli SI Ram Murthy
civil disputes
Nalgonda district
Kurmed village
land grabbing case
police intervention

More Telugu News