Kangana Ranaut: నాకు సొంత కేబినెట్ లేదన్న కంగనా రనౌత్... కాంగ్రెస్ విమర్శలు

Kangana Ranaut Faces Congress Ire Over Himachal Flood Remarks
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ దుమారంలో చిక్కుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని తన నియోజకవర్గమైన మండీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆమె, బాధితుల పట్ల సున్నితత్వం లేకుండా మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది.

ఆదివారం వరద బాధితులతో మాట్లాడుతూ, "విపత్తు సహాయక చర్యలు చేపట్టడానికి నాకేం అధికారిక కేబినెట్ లేదు. నాతో పాటు నా ఇద్దరు సోదరులు ఉన్నారు, ఇదే నా మంత్రివర్గం. ఎంపీగా నా పని పార్లమెంటుకు పరిమితం. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడమే నా బాధ్యత" అని నవ్వుతూ అన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు.

కంగనా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజలు సర్వం కోల్పోయి బాధలో ఉంటే, మండీ ఎంపీ నవ్వుతూ ఎగతాళిగా మాట్లాడటం దారుణమని విమర్శించింది. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "కొంతైనా సున్నితత్వం చూపించండి కంగనా జీ" అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే మండిపడ్డారు.

అంతకుముందు, కంగనా పర్యటన ఆలస్యం కావడంపై హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జైరాం ఠాకూర్ కూడా పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కంగనా స్పందిస్తూ, జైరాం ఠాకూర్ సలహా మేరకే తాను పర్యటనను వాయిదా వేసుకున్నానని, ప్రభావిత ప్రాంతాలకు వెళ్లే మార్గాలు పునరుద్ధరించబడే వరకు వేచి ఉండమన్నారని వివరణ ఇచ్చారు.

హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు 78 మంది మరణించగా, ఒక్క మండీ జిల్లాలోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 700 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
Kangana Ranaut
Himachal Pradesh floods
Mandi
Congress criticism
Supriya Shrinate
Jai Ram Thakur
Disaster relief
Political controversy
BJP MP
Flood victims

More Telugu News