ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం!

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు తీవ్ర అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స
  • గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి హుటాహుటిన తరలింపు
  • గుండె సంబంధిత సమస్యగా గుర్తించి చికిత్స అందిస్తున్న వైద్యులు
  • ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపిన హరీశ్ రావు
జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

మాగంటి గోపీనాథ్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. వైద్యు బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. వారు గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, మాగంటి గోపీనాథ్‌కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు.


More Telugu News