Sajjala Bhargava Reddy: సజ్జల భార్గవరెడ్డి ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవు: మంగళగిరి సీఐ
పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో సజ్జల భార్గవ్రెడ్డి విచారణ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ముగిసింది. అయితే, విచారణలో ఆయన వెల్లడించిన వివరాలు, ఇచ్చిన సమాధానాలపై పోలీసులు సంతృప్తికరంగా లేరని తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, సజ్జల భార్గవ్రెడ్డిని విచారించామని... విచారణ సందర్భంగా ఆయన చెప్పిన సమాధానాలు తమకు సంతృప్తినివ్వలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసి, తిరిగి విచారించే అవకాశం ఉందని సీఐ సూచనప్రాయంగా తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద, అసభ్యకరమైన పోస్టులు షేర్ చేశారనే ఆరోపణలతో సజ్జల భార్గవ్రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగానే మంగళగిరి పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించారు. ప్రస్తుతం పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి సారించినట్లు సమాచారం.
ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, సజ్జల భార్గవ్రెడ్డిని విచారించామని... విచారణ సందర్భంగా ఆయన చెప్పిన సమాధానాలు తమకు సంతృప్తినివ్వలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసి, తిరిగి విచారించే అవకాశం ఉందని సీఐ సూచనప్రాయంగా తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద, అసభ్యకరమైన పోస్టులు షేర్ చేశారనే ఆరోపణలతో సజ్జల భార్గవ్రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగానే మంగళగిరి పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించారు. ప్రస్తుతం పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి సారించినట్లు సమాచారం.