శాంతి చర్చలు జరిగినా రష్యా దాడులు కొనసాగిస్తుందని మండిపడ్డ జెలెన్ స్కీ
- మూడు రోజుల్లో 900 లకుపైగా రష్యా డ్రోన్ల దాడి జరిగిందన్న జెలెన్ స్కీ
- రష్యా కట్టడికి అమెరికా, యూరప్లు కఠిన ఆంక్షలు విధించాలని వినతి
- పుతిన్, జెలెన్ స్కీలపై ట్రంప్ మండిపాటు
ఉక్రెయిన్పై శనివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడింది. యుద్ధం ప్రారంభమైన ఈ మూడు సంవత్సరాలలో ఇదే అతిపెద్ద వైమానిక దాడిగా తెలుస్తోంది.
ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ ఇష్టానుసారంగా ప్రజలను చంపుకుంటూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఉక్రెయిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని పుతిన్ భావిస్తే, అది అంతిమంగా రష్యా పతనానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.
అదే సమయంలో, జెలెన్స్కీపై కూడా ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. జెలెన్స్కీ తన దేశానికి మేలు చేసే విధంగా మాట్లాడటం లేదని, ఆయన మాట్లాడకుండా ఉంటేనే మంచిదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.