ఎన్కౌంటర్ అనంతరం మృతదేహాల ముందు సంబరాలు చేసుకున్న డీఆర్ జీ బలగాలు... వీడియో ఇదిగో!
- ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు భారీ ఎన్కౌంటర్
- ఘటనలో 27 మంది మావోయిస్టులు హతం
- మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు
- మావోల మృతదేహాల వద్ద డీఆర్జీ బలగాల సంబరాలు
- ఈ దృశ్యాలు వివాదాస్పదమయ్యే అవకాశం
వివరాల్లోకి వెళితే, ఛత్తీస్గఢ్లోని అబూజ్ మఢ్ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన తీవ్రస్థాయి ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో మావోయిస్టు పార్టీ సుప్రీం నాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నాడు. ఈ ఆపరేషన్ను డీఆర్జీ బలగాలు విజయవంతంగా నిర్వహించాయి.
అయితే, ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత, హతమైన మావోయిస్టుల మృతదేహాలను ఒకచోట ఉంచినప్పుడు, డీఆర్జీ సిబ్బంది ఆ మృతదేహాల వద్ద నిలబడి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. తుపాకులను గాల్లోకి ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.