అమెరికాలో ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది దారుణ హత్య
- జ్యూయిష్ మ్యూజియం సమీపంలో బుధవారం సాయంత్రం ఘటన
- హోంలాండ్ సెక్రటరీ, ఎఫ్బీఐ డైరెక్టర్ దిగ్భ్రాంతి, దర్యాప్తునకు ఆదేశం
- ఘటనను తీవ్రంగా ఖండించిన ఐరాసలో ఇజ్రాయెల్ రాయబారి
కాల్పుల ఘటన గురించి సమాచారం అందిందని, బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అన్నారు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ (ఎంపీడీ)తో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాల్పులు జరిగిన సమయంలో మ్యూజియంలో అమెరికన్ జ్యూయిష్ కమిటీ (ఏజేసీ) ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరుగుతోందని సమాచారం.
ఈ దాడిని ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డనోన్ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయమైన యాంటీ-సెమిటిక్ ఉగ్రవాద చర్య అని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఫెడరల్ స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. వాషింగ్టన్ డీసీ పోలీసులు ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, సాక్షులు, సీసీటీవీ ఫుటేజ్ కోసం గాలిస్తున్నారు.