కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్, వెబ్‌సైట్ డౌన్

Pakistan Stock Market Crashes Website Goes Down
భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్  భారీ నష్టాలను చవిచూస్తోంది. అంతేకాకుండా, శుక్రవారం పీఎస్ఎక్స్ అధికారిక వెబ్‌సైట్ కూడా సాంకేతిక కారణాలతో తాత్కాలికంగా నిలిచిపోయింది. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడి, అనంతరం భారత్ తీసుకున్న కఠిన ప్రతిస్పందన చర్యల నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

నిన్న గురువారం నాడు ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం ఐదు నిమిషాల్లోనే పీఎస్ఎక్స్ కీలక సూచీ కేఎస్ఈ-100 ఏకంగా 2.12 శాతం (2,485.85 పాయింట్లు) పతనమై 114,740.29 వద్దకు చేరింది. అంతకుముందు బుధవారం కూడా మార్కెట్ భారీగా నష్టపోయింది. దీంతో రెండు రోజుల్లోనే సూచీ దాదాపు 2,500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈ నష్టాల పరంపర కొనసాగుతుండగానే, శుక్రవారం ఉదయం పీఎస్ఎక్స్ వెబ్‌సైట్ "త్వరలో అందుబాటులోకి వస్తాము" (We'll be back soon) అనే సందేశంతో ఆఫ్‌లైన్‌లోకి వెళ్లింది. వెబ్‌సైట్ ఎందుకు డౌన్ అయిందనే దానిపై గానీ, ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై గానీ పీఎస్ఎక్స్ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, వాఘా-అటారీ సరిహద్దు వద్ద వాణిజ్యాన్ని మూసివేయడం, సార్క్ వీసా మినహాయింపులను రద్దు చేయడం వంటి కఠిన చర్యలను ప్రకటించింది. దీనికి తోడు పాకిస్థాన్ కూడా తమ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఇప్పటికే ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వృద్ధి రేటు అంచనాలను ఈ ఆర్థిక సంవత్సరానికి 2.6 శాతానికి తగ్గించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ వరుస పరిణామాలు పెట్టుబడిదారులలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.
 
Go Back to Shorts
Pakistan Stock Exchange
PSX
Pakistan Economy
India-Pakistan Tensions
KSE-100 Index
Market Crash
Website Down
Pulwama Attack
Financial Crisis
International Monetary Fund

More Telugu News