రిజర్వేషన్లు కావాలంటే జనాభా తేలాలి: రేవంత్ రెడ్డి
- జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా
- బీసీల గొంతును వినిపించడానికే కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడి
- దామాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలనేది కాంగ్రెస్ నిర్ణయమన్న ముఖ్యమంత్రి
జనగణనతో పాటు కులగణనను కూడా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలనేది తమ పార్టీ విధానమని ఆయన స్పష్టం చేశారు. బీసీలను బలపర్చాలనే ఆలోచన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి లేదని ఆయన విమర్శించారు. దేశంలో జనగణనతో పాటు కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.