ఎల్బీ నగర్ డీసీపీపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ తీవ్ర ఆగ్రహం
- డీసీపీ తీరును ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానన్న మధుయాష్కీ
- డీసీపీ శాంతిభద్రతలపై పార్ట్ టైమ్గా పని చేస్తున్నారని ఎద్దేవా
- డీసీపీ ఇప్పటికైనా తీరు మార్చుకుంటే మంచిదని హితవు
ఎల్బీనగర్ డీసీపీ ఇప్పటికైనా తన ప్రవర్తనను మార్చుకోవాలని మధుయాష్కీ సూచించారు. ఒకవేళ డీసీపీ తన తీరును మార్చుకోకపోతే ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. మధుయాష్కీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే.