సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్... విచారణ వాయిదా!
- ఏడుగురు ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా చేర్చిన కేటీఆర్
- అసెంబ్లీ కార్యదర్శి తరపున ముకుల్ రోహత్గి వాదనలు
- తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా తన వాదనలు వినిపిస్తూ... స్పీకర్ నుంచి మరింత సమాచారం తీసుకోవడానికి కొంత సమయం కావాలని కోరారు. స్పీకర్ తో చర్చించి కోర్టుకు వివరాలను అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ... ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని, ఇంకెంత గడువు కావాలని ప్రశ్నించింది. అయితే, ముకుల్ రోహత్గి విన్నపంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.