వెయిట్ లిఫ్టర్ నీలం రాజుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందనలు

CM Chandrababu appreciates AP weight lifter Neelam Raju for clinching gold medal in national games
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరాఖండ్ లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఏపీ వెయిట్ లిఫ్టర్ నీలం రాజు పసిడి పతకంతో సత్తా చాటాడు. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.  

"38వ జాతీయ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశం 67 కిలోల కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలుచుకున్న ఏపీకి చెందిన కె. నీలం రాజుకు హృదయపూర్వక అభినందనలు. నీ అంకితభావం, కఠోర శ్రమ మన రాష్ట్రాన్ని గర్వించేలా చేశాయి. భవిష్యత్తులోనూ నువ్వు ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

అటు, మంత్రి నారా లోకేశ్ కూడా నీలం రాజు పసిడి ప్రదర్శన పట్ల స్పందించారు. ఏపీకి చెందిన నీలం రాజు జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ 67 కిలోల కేటగిరీలో నీలం రాజు పసిడి గెలిచాడని వెల్లడించారు. ఏపీ నుంచి వెలుగు చూస్తున్న ప్రతిభకు ఇది నిజమైన నిదర్శనం అని, ఇలాగే రాణిస్తుండాలని కోరుకుంటున్నామని లోకేశ్ పేర్కొన్నారు.
Go Back to Shorts
K.Neelam Raju
Gold Medal
Chandrababu
Andhra Pradesh
Weight Lifting
National Games
Uttarakhand

More Telugu News