Saif Ali Khan Attack Case: సైఫ్ పై దాడి కేసు: వేలిముద్రల ఫైనల్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్న పోలీసులు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ముంబయి పోలీసులు ఇప్పటికే ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేయడం తెలిసిందే. బంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లామ్ షేజాద్ అనే వ్యక్తిని థానేలో అదుపులోకి తీసుకున్నారు. అయితే, సైఫ్ ఇంట్లో లభ్యమైన వేలిముద్రలతో, అరెస్టయిన వ్యక్తి వేలిముద్రలు సరిపోలడంలేదంటూ కొన్ని కథనాలు వచ్చాయి. 

అయితే ఈ కథనాల్లో వాస్తవం లేదని తాజాగా వెల్లడైంది. ప్రాథమికంగా అతడి వేలిముద్రలతో సైఫ్ ఇంట్లో సేకరించిన వేలిముద్రలు సరిపోలాయని గుర్తించారు. అయితే,  పోలీసులు పూర్తిస్థాయి వేలిముద్రల నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అంశాన్ని ముంబయి 9వ జోన్ డీసీపీ దీక్షిత్ నిర్ధారించారు. తాము వేలిముద్రలకు సంబంధించిన ఫైనల్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ముంబయి జేసీపీ (లా అండ్ ఆర్డర్) సత్యనారాయణ్ చౌదరి స్పందిస్తూ... ఈ కేసులో ఆధారాలు ఉన్నందునే షరీఫుల్ ఇస్లామ్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. 

అటు, బాంద్రా కోర్టు షరీఫుల్ కు జనవరి 29 వరకు కస్టడీ పొడిగించింది. నిందితుడిని సైఫ్ అలీ ఖాన్ ముందుకు తీసుకురానున్నారు. సైఫ్ అతడ్ని గుర్తించాల్సి ఉంటుంది.
Saif Ali Khan Attack Case
Finger Prints
Final Report
Police
Mumbai Indians

More Telugu News