India vs England: రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా.. రెండు మార్పుల‌తో బ‌రిలోకి.. తెలుగు కుర్రాడు మిస్‌

India vs England 2nd T20I at Chennai
  • చెన్నై వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లండ్‌ రెండో టీ20
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • రింకూ, నితీశ్ రెడ్డి ఔట్‌.. సుంద‌ర్‌, జురెల్ ఇన్‌

చెన్నై వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు రెండు మార్పులు చేసింది. తొలి టీ20లో ఆడిన రింకూ సింగ్ తో పాటు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లో ఆడ‌డం లేదు. వారి స్థానంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, ధ్రువ్ జురెల్ ఆడుతున్నారు. మ‌రోసారి పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ షమీ బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. 

అటు ఇంగ్లండ్ కూడా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. జేమీ స్మిత్‌, బ్రైడాన్ కార్స్ ఆ జ‌ట్టు త‌ర‌ఫున ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తున్నారు. ఇక ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో ఆతిథ్య భార‌త్ తొలి మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం సాధించి బోణీ కొట్టిన విష‌యం తెలిసిందే.   

భారత్: సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.

ఇంగ్లండ్‌: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
India vs England
2nd T20I
Chennai
Team India
Cricket
Sports News

More Telugu News