నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ సంతోషాలు నింపాలి: లోకేశ్
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలను మోసుకు వస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.