మున్సిపల్ సిబ్బందిపై దుర్భాషలు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
- స్వర్ణముఖి నది కరకట్టపై అక్రమ నిర్మాణాలు తొలగించే పనులు చేపట్టిన మున్సిపల్ అధికారులు
- మున్సిపల్ సిబ్బందిని అడ్డుకుని దుర్భాషలాడిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- మాజీ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి శారద
బూతు పదజాలంతో అధికారులపై ఆయన విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే విధి నిర్వహణలో తమపై మాజీ ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి అసభ్య పదజాలంతో దూషించారంటూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి శారద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.