సంధ్య థియేటర్ ఘటనలో ముగ్గురి అరెస్ట్

Police arrest three people in Sandhya theaters stumpede
  • పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట
  • రేవతి అనే మహిళ మృతి
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • తాజాగా సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ అరెస్ట్
పుష్ప-2 రిలీజ్ కు ముందు డిసెంబరు 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు హైదరాబాదులో ప్రీమియర్ షో వేయడం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రావడం, తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ లను పోలీసులు అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. 

కాగా, ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. మృతి చెందిన మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ ఇటీవలే రూ.25 లక్షల సాయం ప్రకటించారు. ఆమె కుటుంబానికి తాను అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు.
Go Back to Shorts
Pushpa-2
Sandhya Theater
Stumpede
Police
Hyderabad

More Telugu News