Actress Kasthuri: తెలుగు జాతిపై నోరు పారేసుకున్న తమిళనటి కస్తూరి

Tamil Actress Kasthuri controversial comments on Telugu people
  • తమిళనాడులోని బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడుతూ తెలుగు జాతిపై వివాదాస్పద వ్యాఖ్యలు
  • అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారని వ్యాఖ్య
  • అలా వచ్చిన వారు ఇప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • మంచి చెబుతున్న బ్రాహ్మణులకు వ్యతిరేకంగా తమిళనాడులో ప్రచారం జరుగుతోందని ఆవేదన
తెలుగు ప్రజలపై తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి నోరు పారేసుకున్నారు. తమిళనాడులోని బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడుతూ తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులను పరోక్షంగా ప్రశ్నించారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయవద్దని, ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండటంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని కస్తూరి ఆరోపించారు.
Actress Kasthuri
BJP
Kollywood
Telugu People

More Telugu News