ఫైనాన్సియర్ చేతిలో మోసపోయిన గౌతమి.. న్యాయం జరిగే వరకు పోరు ఆపేది లేదన్న నటి
- గౌతమికి చెందిన 150 ఎకరాల స్థలాన్ని అమ్మిపెడతానని రూ. 3.1 కోట్లు తీసుకున్న అళగప్పన్
- అళగప్పన్ బెయిలు పిటిషన్పై నిన్న విచారణ
- బెయిలు ఇవ్వొద్దని వాదించిన గౌతమి తరపు న్యాయవాది
తమిళనాడులోని రామనాథపురం జిల్లా ముతుకులత్తూర్ సమీపంలో గౌతమికి 150 ఎకరాల స్థలం ఉంది. దీనిని అమ్మిపెడతానని కారైక్కుడికి చెందిన సినీ ఫైనాన్సియర్ అళగప్పన్ రూ. 3.1 కోట్లు తీసుకుని మోసం చేసినట్టు గౌతమి ఆరోపిస్తున్నారు. ఆయన నుంచి తన డబ్బులు తనకు ఇప్పించాలని కోరుతూ రామనాథపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా నిన్న ఆమె కోర్టుకు హాజరయ్యారు.