కర్ణాటకలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా

  • బాగేపల్లి మండలం చుండూరు వద్ద ప్రమాదం 
  • బస్సు బెంగళూరు నుంచి పుట్టపర్తి వస్తుండగా ప్రమాదం
  • గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలింపు
కర్ణాటకలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బాగేపల్లి మండలం చుండూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు బెంగళూరు నుంచి పుట్టపర్తి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

APSRTC
Andhra Pradesh
Karnataka
Road Accident

More Telugu News