నైజీరియాలో కూలిన స్కూలు భవనం.. 22 మంది విద్యార్థుల దుర్మరణం
- నార్త్ సెంట్రల్ నైజీరియాలో కుప్పకూలిన స్కూలు భవనం
- 22 మంది విద్యార్థుల దుర్మరణం, 132 మంది క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స
- నదీ తీరం సమీపంలో నిర్మించడంతో భవనం బలహీనపడి కూలిందంటున్న అధికారులు
మరోవైపు, స్కూల్ కూలిన ప్రాంతానికి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. క్షతగాత్రులను వెలికి తీసేందుకు ఎమర్జెన్సీ సిబ్బందితో పాటు జాతీయ ఎమెర్జెన్సీ మేనేజ్మెంట్ కూడా పాల్గొంది. స్కూలు ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్తనాదాలతో ప్రాంతమంతా విషాదవాతావరణం కనిపించింది.
స్కూల్ భవనంలో నిర్మాణపరమైన లోపాలే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. నదీ తీరానికి సమీపంలో నిర్మించడంతో భవనం బలహీనపడిందని తెలిపారు. భనవం నిర్వహణ కూడా సరిగా లేదన్నారు. కాగా, ఆఫ్రికాలో అత్యధిక జనాభా గల నైజీరియాలో భవనాలు కూలడం నిత్య కృత్యంగా మారింది. భవనం నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడం మెయింటెనెన్స్ సరిగా లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమని అక్కడి అధికారులు చెబుతుంటారు.